జగన్, చంద్రబాబులపై షర్మిల విమర్శలు
NEWS Jun 30,2025 04:14 pm
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దాసోహమయ్యారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం ఈ జూన్ నెలలోనే 26 జిల్లాల్లో సుమారు 2,500 కిలోమీటర్లు పర్యటించానని తెలిపారు.