అమరావతిలో క్వాంటమ్ పార్క్.. ఏపీని టెక్ హబ్గా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు
NEWS Jun 30,2025 02:11 pm
రాజధాని అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భవిష్యత్ టెక్నాలజీగా భావిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో అమరావతిలో క్వాంటమ్ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వంతో కలిసి ఈ బృహత్తర ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థలు ముందుకు రావడం విశేషం.