నాలుగు గ్రామాలను తెలంగాణలో కలపాలి
NEWS Jun 30,2025 01:51 pm
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర సర్కార్ కు లేఖ రాశారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న 4 గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచి సరైన సౌకర్యాలు, వసతులు లేక యటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.