హౌసింగ్ బోర్డు ఆస్తుల వేలానికి సిద్ధం
NEWS Jun 30,2025 09:27 am
హైదరాబాద్ పరిధిలోని పలు హౌసింగ్ బోర్డు ఆస్తులను వేలం వేసి రూ.539 కోట్ల ఆదాయం పొందాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. కేపీహెచ్బీ కాలనీ ఫేజ్-4 పరిధిలోని సర్వే నం.1009 లో ఉన్న 7.33 ఎకరాల వేలంతో దాదాపు రూ.392 కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా వేస్తోంది.ఫేజ్-4 పరిధిలో ఉన్న 4598, 2420 చదరపు గజాల రెండు ప్లాట్ల వేలంతో రూ.73 కోట్లు రావొచ్చని అంచనా వేస్తోంది. ఎస్ఆర్ నగర్లోని కమ్యూనిటీ హాల్ వేలంతో రూ.53 కోట్లు, నాంపల్లిలోని 1148 చదరపు గజాల ఖాళీ స్థలం వేలంతో రూ.23 కోట్ల ఆదాయం రావొచ్చని ప్లాన్ చేసింది.