కోడిపందాల శిబిరాలపై పోలీసుల దాడులు
NEWS Jun 29,2025 10:26 pm
పామూరు మండలంలోని బుక్కాపురం గ్రామ శివారులో ఆదివారం కోడి పందాల శిబిరాలపై ఎస్సై కిషోర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడులలో 14 మంది కోడి పందాలు ఆడేవారు, 8 కోళ్లు,20,150 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా పేకాట కోడిపందాలు అంటే నిర్వహిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.