మున్సిపల్ కార్మికులతో సమ్మె విరమింప చేసిన కమిషనర్
NEWS Jun 29,2025 10:23 pm
26వ తేదీ నుండి సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో మున్సిపల్ కమిషనర్ ఎన్ రామారావు స్వయంగా జరిపిన చర్చలతో సమ్మెను విరమింపజేసి ప్రజలకు జరుగుతున్న అసౌకర్యాన్ని కూడా పరిష్కరించారు. పారిశుద్ధ్య కార్మికులు, ఔట్సోర్సింగ్ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ బకాయి వంటి సమస్యలకు పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చి సమ్మెను విరమింపజేసిన కమిషనర్ ను పురప్రజలు అభినందిస్తున్నారు.