తెలంగాణలో మెడికోలకు ఖుష్ కబర్
NEWS Jun 29,2025 08:10 pm
రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది మెడికోలకు. భారీగా స్టైఫండ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 15 శాతం పెంచుతూ జీవో జారీ చేసింది. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం కూడా పెంచింది. ఈ పెంపుతో ఇంటర్న్లకు నెలకు రూ. 29, 792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో రూ. 67,032, సెకండ్ ఇయర్లో రూ. 70, 757, ఫైనల్ ఇయర్లో రూ. 74, 782 చొప్పున స్టయిఫండ్ ఇవ్వనుంది సర్కార్.