మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ నాయకులు
NEWS Jun 29,2025 10:21 pm
మల్యాల మండల బీజేపీ అధ్యక్షుడు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మన్ కీ బాత్ ప్రోగ్రాంను టీవీలో వీక్షించారు. ప్రతి నెల చివరి వారంలో జరిగే ఈ ప్రోగ్రాంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను, భారతీయులు సాధించిన విజయాలను ప్రజలతో పీఎం పంచుకోనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.