మహా న్యూస్ ఆఫీసుపై దాడి.. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన
NEWS Jun 28,2025 06:23 pm
హైదరాబాద్లోని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ 'మహా న్యూస్' ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి తమ మద్దతు ప్రకటించారు.