పోస్టాఫీసుల్లో యూపీఐ చెల్లింపులు.. ఆగస్టు నుంచి కొత్త విధానం అమలు!
NEWS Jun 28,2025 02:33 pm
దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో నగదు చెల్లింపుల విధానానికి స్వస్తి పలికి, డిజిటల్ లావాదేవీలకు మార్గం సుగమం అవుతోంది. 2025 ఆగస్టు నాటికి భారతదేశంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు తపాలా శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ ఆధునిక మార్పుతో వినియోగదారులు పోస్టల్ సేవలకు సులభంగా, సురక్షితంగా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.