అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. చివరి మృతదేహం గుర్తింపు
NEWS Jun 28,2025 11:35 am
అహ్మదాబాద్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 12న జరిగిన ఈ దుర్ఘటనలో మరణించిన ప్రయాణికులలో చివరి మృతదేహాన్ని అధికారులు శుక్రవారం రాత్రి గుర్తించారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 260కి చేరినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. ఈ ప్రక్రియతో మృతులందరి గుర్తింపు పూర్తయినట్లయింది.