తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
NEWS Jun 27,2025 03:06 pm
తెలంగాణలో పురపాలక ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర హైకోర్టు దృష్టి సారించింది. నిర్ణీత సమయంలో ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం, ప్రభుత్వ స్పందనను కోరింది.