యూనివర్సిటీ సమస్యలను పరిష్కరించండి
NEWS Jun 27,2025 10:37 pm
ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీలో బోధనా సిబ్బంది భర్తీతోపాటు వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ను ఎమ్మెల్యే జనార్దన్ కోరారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఒంగోలులో అండరగ్రౌండ్ డ్రైనేజీని త్వరగా మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఒంగోలు అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.