రేవంత్ సర్కార్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
NEWS Jun 27,2025 04:16 pm
జూరాల ప్రాజెక్టు ఘటన జరిగి ఒక్కరోజు కూడా గడవకముందే, ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాల దాహార్తిని తీర్చే మంజీరా బ్యారేజీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఈ చేతకానితనం వల్లే నిన్న జూరాలకు, నేడు మంజీరాకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆయన ఆరోపించారు.