ఫోన్ ట్యాప్ చేసి బెదిరించారు - ఎంపీ
NEWS Jun 27,2025 04:03 pm
బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వాపోయారు. తన ఫోనుతో పాటు తన భార్య ఫోను కూడా ట్యాప్ చేసి బెదిరించారని అన్నారు. దీంతో తట్టుకోలేక తాను బెంగళూరుకు పారి పోయానని బాంబు పేల్చారు. రెండు వారాల పాటు హోటల్ లో తలదాచుకున్నానని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన కేసీఆర్, కేటీఆర్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులకు శిక్ష పడాల్సిందేనని పేర్కొన్నారు.