అన్నపూర్ణ భోజన కేంద్రాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
NEWS Jun 27,2025 03:41 pm
హైదరాబాద్ పేదలు, శ్రామికుల ఆకలి తీరుస్తున్న రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాలు సమూల మార్పులకు సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, ఈ కేంద్రాల పేరును 'ఇందిరా క్యాంటీన్లు'గా మార్చనున్నారు. కేవలం పేరు మార్పుకే పరిమితం కాకుండా, సేవలను విస్తరించి, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టబోతున్నారు.