జగన్పై తొందరపాటు చర్యలొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
NEWS Jun 27,2025 01:44 pm
పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 1వ తేదీకి వాయిదా వేసింది.