విజయవాడలో టూరిజం సదస్సు.. క్యారవాన్లను ప్రారంభించిన చంద్రబాబు
NEWS Jun 27,2025 11:52 am
ఏపీలో పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా విజయవాడలో ఈ రోజు టూరిజం కాన్క్లేవ్ను ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.