అధికారుల తీరుపై డిప్యూటీ స్పీకర్ ఫైర్
NEWS Jun 27,2025 10:56 am
ఏపీలో అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. ఎమ్మెల్యేలను అవమానించారంటూ వాపోయారు. కార్పొరేషన్ డైరెక్టర్లతో ఎమ్మెల్యేలను కూర్చోబెట్టడం ఏంటి అంటూ ప్రశ్నించారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఈ విషయం గురించి తనతో చెప్పారని అన్నారు. దీనిపై సీఎస్ కు లేఖ రాస్తానని స్పష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆరా తీస్తోంది సీఎంఓ.