ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు జగన్ కు లేదు
NEWS Jun 27,2025 10:25 am
ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి సీరియస్ అయ్యారు. మాజీ సీఎం జగన్ ను ఏకి పారేశారు. తనకు ప్రజా సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి మద్యం మాఫియా నడిపించాడని ఆరోపించారు. రైతులను నట్టేట ముంచాడని వాపోయారు. వైఎస్సార్ పనులు ప్రారంభించిన జలయజ్ఞం ముట్టు కోలేదన్నారు. 6 నెలల్లో ఒక్క ప్రాజెక్టు కూడా ముట్టు కోలేదన్నారు. పర్యటనల పేరుతో బల ప్రదర్శన చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.