బధిర బాలికపై తోటి విద్యార్థి అత్యాచారం
NEWS Jun 27,2025 05:44 pm
ఒంగోలు మహిళా పోలీసు స్టేషన్లో ఓ బధిర బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రాచర్ల మండలానికి చెందిన ఆ బాలికపై సహచర విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికకు తరచూ కాళ్లు వాస్తున్నాయని సిబ్బంది సమాచారం ఇవ్వడంతో మేనత్త వెళ్లి ఆ బాలికను ఒంగోలు రిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించగా గర్భిణీగా తేలింది. బాలిక సైగల ద్వారా తోటి బాలుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.