ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు బుమ్రా దూరం!
NEWS Jun 27,2025 07:23 am
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, బర్మింగ్హామ్ వేదికగా జులై 2న ప్రారంభం కానున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. పనిభారం నిర్వహణలో భాగంగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు యాజమాన్యం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.