CM రేవంత్రెడ్డిపై పరువు నష్టం కేసు: హైకోర్టులో విచారణ వాయిదా
NEWS Jun 26,2025 01:00 pm
ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జూలై 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.