కాగ్నిజెంట్ కు వెల్కమ్ చెప్పిన సీఎం చంద్రబాబు
NEWS Jun 26,2025 04:22 pm
అంతర్జాతీయ టెక్ సంస్థ కాగ్నిజెంట్ భారత్ లో తన కార్యకలాపాలను మరింత విస్తరించే క్రమంలో, ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడుతోంది. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కాగ్నిజెంట్ సంస్థకు సాదర స్వాగతం పలికారు. ఈ పరిణామం రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.