కూటమి ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లోపించింది: జగన్
NEWS Jun 26,2025 04:21 pm
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను గాలికొదిలేసి, రాజ్యాంగ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, నిధుల సమీకరణ పద్ధతులపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు.