ఘనంగా మదన వేణుగోపాలస్వామికి పూజలు
NEWS Jun 26,2025 10:31 pm
పామూరులోని మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల అనంతరం గురువారం రుక్మిణి సమేత మదన వేణుగోపాల స్వామికి 16 రోజుల పండుగను ఈవో గిరిరాజు నరసింహరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆర్యవైశ్య సంఘ నాయకులు తడికమళ్ళ సుబ్బారావు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేశారు.