డబుల్ ఇంజన్ సర్కార్ సూపర్
NEWS Jun 26,2025 11:19 am
ఏపీలో కొలువు తీరిన డబుల్ ఇంజన్ సర్కార్ అద్భుతంగా పని చేస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శక్తివంతమైన నాయకత్వానికి నమూనాగా రాష్ట్రం కేరాఫ్ గా మారి పోయిందన్నారు. రాజమండ్రి ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. ముందుగా గుర్తుకు వచ్చేది గోదావరి తీరం అని స్పష్టం చేశారు. ఎంతో కాలంగా ఉన్న కలను కూటమి హయాంలో కేంద్ర సహకారంతో సాకారం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.