విశాఖలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు.. మంత్రి నారా లోకేశ్ హర్షం
NEWS Jun 26,2025 05:34 am
ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ తమ భవిష్యత్తు కార్యకలాపాలకు విశాఖను ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడం పట్ల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కాగ్నిజెంట్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు.