డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
NEWS Jun 26,2025 10:13 am
ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని అందరూ భావించారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధం ముగిసిపోయిందంటూ కొన్ని పోస్టులు చేశారు. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రశాంతతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ఆ రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధం రావొచ్చనే అనుమానాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు.