అలకనంద నదిలో పడ్డ మినీ బస్సు
NEWS Jun 26,2025 10:01 am
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, పది మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు ఏడుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. స్థానికులు మానవహారంగా ఏర్పడి గాయపడిన ప్రయాణికులను కొండపైకి చేర్చారు.