మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
NEWS Jun 26,2025 03:53 am
గత నెలలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లార్చడంలో తనదే కీలక పాత్ర అని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని తానే కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. భారత్ ఈ వాదనను ఇప్పటికే పలుమార్లు ఖండించినప్పటికీ ట్రంప్ మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. పైగా, ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించిన తర్వాతే వారు యుద్ధం ఆపారని, తద్వారా అణుయుద్ధాన్ని నివారించగలిగానని చెప్పుకొచ్చారు.