రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ, కానిస్టేబుల్ మృతి
NEWS Jun 26,2025 03:58 am
సూర్యాపేట జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ బైపాస్లోని దుర్గాపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఒక కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏపీకి చెందిన ఓ ఎస్ఐ, కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో కానిస్టేబుల్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.