మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలి
NEWS Jun 25,2025 08:56 pm
మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్ అన్సారియా, ఎస్పీ దామోదర్ కోరారు. ఈ నెల 26న అంతర్జాతీయ మాదకద్రవ్య రహిత దినోత్సవం సందర్భంగా ఒంగోలులో చేపట్టనున్న కార్యక్రమ నిర్వహణపై అధికారులతో కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు.