హత్య కేసులో నిందితుల అరెస్ట్
NEWS Jun 25,2025 08:57 pm
మర్రిపూడి ఎంఈవో కార్యాలయ ఉద్యోగి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు కనిగిరి డీఎస్పీ యశ్వంత్ చెప్పారు. మరిపూడి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 18న పొదిలి కొండ సమీపంలో మర్రిపూడి ఎంఈవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ కొల్లా రాజశేఖర్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితులు జగన్నాథం రాజశేఖర్, పల్లా అనుషలను అరెస్ట్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సోమశేఖర్, ఎస్సై రమేష్ పాల్గొన్నారు.