అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా
NEWS Jun 25,2025 04:27 pm
భారత అంతరిక్ష యాత్రల చరిత్రలో మరో మైలురాయి ఆవిష్కృతమైంది. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి విజయవంతంగా పయనమయ్యారు. ఈ అంతర్జాతీయ బృందానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు. ఈ చారిత్రాత్మక ప్రయోగం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ శుభాంశు శుక్లాకు, మిషన్ బృందానికి అభినందనలు తెలిపారు.