స్వామి ముద్దంకు జర్నలిస్టుల ప్రశంస
NEWS Jun 25,2025 11:57 am
ఏపీయూడబ్ల్యూజే మహాసభల సందర్బంగా ఒంగోలులో కృత్రిమ మేధ - సోషల్ మీడియా - వాస్తవాల నిర్ధారణ అనే అంశంపై ప్రసంగించారు సీనియర్ జర్నలిస్ట్ స్వామి ముద్దం. జర్నలిస్టులకు విలువైన సూచనలు ఇచ్చారు. మారుతున్న టెక్నాలజీని మరింత ఉపయోగించుకునేలా తమను తాము కృషి చేయాలని కోరారు. ఈ అంశాలపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిజం రంగంలో నూతన ఒరవడులను అర్థం చేసుకోవడానికి దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు. జర్నలిస్టులు స్వామి ముద్దంను ప్రశంసించారు. ఈ సెమినార్లో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, IJU అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.