కనకదుర్గమ్మను దర్శించుకున్న పలాస ఎమ్మెల్యే
NEWS Jun 25,2025 10:12 am
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖంగా, సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు ఎమ్మెల్యే గౌతు శిరీష.