గేదెల దొంగలు ఇద్దరు అరెస్ట్
NEWS Jun 24,2025 10:59 pm
సింగరాయకొండ: సోమరాజుపాలెం గ్రామంలో బ్రహ్మయ్య అనే వ్యక్తికి చెందిన 5 గేదెలను చోరీ చేశారు. అర్ధరాత్రి గేదెలను అపహరించారు దుండగులు. బ్రహ్మయ్య సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా స్పందించిన సింగరాయకొండ ఎస్సై మహేంద్ర ముమ్మరంగా గాలించి ఇద్దరు దొంగలను పట్టుకుని వారి వద్దనున్న 5 గేదెలను రైతు బ్రహ్మయ్యకి అప్పగించారు. ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టుకి హాజరు పరిచామన్నారు ఎస్ఐ మహేంద్ర.