సింగయ్య మృతి కేసులో జగన్ కు నోటీసులు
NEWS Jun 24,2025 08:12 pm
జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో జగన్ ను ఏ2గా పేర్కొన్న పోలీసులు... తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు నోటీసులతో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యలయానికి వెళ్లారు. అక్కడ వైసీపీ కార్యాలయ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అంతేకాదు, సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చ్యూనర్ (AP 40 DH 2349) వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.