కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
NEWS Jun 24,2025 07:23 pm
తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ హయాంలో అప్పుల కుప్పగా మారితే, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు మాత్రం ఎలా సంపన్నులయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సచివాలయం ఎదుట రాజీవ్గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన 'రైతు నేస్తం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.