కేసీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ - ఈటల
NEWS Jun 24,2025 05:16 pm
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్యమంత్రి కనుసన్నలలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ, శాంతిభద్రతలు, SIB అన్నీ సీఎం వద్దే ఉంటాయన్నారు. తన హయాంలోనే ఇది జరిగిందని, ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.