మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డీఈఓ
NEWS Jun 24,2025 05:14 pm
నరసన్నపేట మండలం దేశవానిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని డిప్యూటీ డీఈఓ విజయ కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏ మేరకు విద్యార్థులకు భోజనం అందిస్తున్నారో హెచ్ఎం ప్రసాద్, ఉపాధ్యాయులతో పాటు వంట ఏజెన్సీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా మెనూ పాటించాలని ఆమె ఆదేశించారు.