సత్తా చాటిన సొండిపూడి విద్యార్థులు
NEWS Jun 24,2025 07:42 pm
మందస మండలం సొండిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు త్రిబుల్ ఐటీలో ప్రవేశం పొందారు. మట్ట హర్ష, డొక్కరి మాధవి, బాడ శ్రీజ, భాగ్యలక్ష్మీ పాణిగ్రాహి త్రిబుల్ ఐటీ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చి శ్రీకాకుళం ఆర్.జి.యు.కె.టిలో సీటు సాధించారు. వీరిని ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్, ఎస్ఎంసి సభ్యులు అభినందించారు.