జీడి కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలి
NEWS Jun 24,2025 02:23 pm
తమ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ మందసలో జీడి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ రావులు సంఘీభావం తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి గణపతి అధ్యక్షతన జరిగిన సభలో పలువురు మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను యాజమాన్యాలు తుంగలో తొక్కి తీవ్ర దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు.