రోడ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వండి
NEWS Jun 24,2025 05:10 pm
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆ శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజను ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కోరారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఎంపీతో పాటు గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి, యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి మీద చర్చించారు.