AI, సోషల్ మీడియాపై APUWJ సెమినార్
NEWS Jun 24,2025 12:47 pm
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 36వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు నగరంలో ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, IJU అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా 'AI మీడియా - వాస్తవాలు' అంశంపై APUWJ సె మినార్ నిర్వహించింది. ప్రధానవక్త స్వామి ముద్దం ప్రసంగించారు. APUWJ అధ్యక్షులు ఐవి సుబ్బారావు అధ్యక్షతన ఈ సెమినార్ లో యూనియన్ నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు.