ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ
NEWS Jun 24,2025 09:34 am
జీహెచ్ఎంసీలో ఏఈగా పని చేస్తున్న మనీషా ఏసీబీకి చిక్కింది లంచం తీసుకుంటూ. వరుసగా ఏసీబీ దాడులు చేస్తున్నా అధికారులు డోంట్ కేర్ అంటున్నారు. అంబర్పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో బిల్లులు ఆమోదం చేసేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేసింది. రూ. 15 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఆమెపై కేసు నమోదు చేసింది ఏసీబీ.