రేవంత్, బండిపై భగ్గుమన్న దాసోజు
NEWS Jun 24,2025 08:32 am
ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు.కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డిలు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఓ వైపు చంద్రబాబు బల్కచర్ల ప్రాజెక్టుకు అనుమతి తెచ్చుకుంటే ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని, టీడీపీ పాలన సాగుతోందని ఫైర్ అయ్యారు. ఈటెల రాజేందర్తో అధ్యక్ష పదవిపై ఉన్న పేచీతోనే బండి సంజయ్ కాళేశ్వరంపై విషం కక్కుతున్నారని ఆరోపించారు.