ఒంగోలు పరిధిలోని త్రోవగుంట జాతీయ రహదారిపై ఈ వేకువజామున ఉలవపాడు నుంచి గుంటూరుకు మామిడికాయల లోడుతో వెళుతున్న వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే పోలీసులు.. మామిడికాయలను వేరే వాహనంలో మార్కెట్కు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.