స్పోర్ట్స్ పాలసీకి కేబినెట్ లైన్ క్లియర్
NEWS Jun 24,2025 07:20 am
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ పాలసీని ఆమోదించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మినిట్స్ తో కూడిన పూర్తి నివేదికను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ కు అందించాలని నిర్ణయించింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించనున్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను స్పెషల్ డ్రైవ్ చేపట్టి క్లియర్ చేయాలని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.